Kishan Reddy : కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బిజెపి పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ నగరం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా..కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దేశంలో హైదరాబాదుతో పాటు కీలక నగరాలను ..కేంద్రం.. కేంద్ర పాలిత ప్రాంతాల గుర్తిస్తున్నట్లు అసదుద్దీన్ పార్లమెంటులో ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో అసదుద్దీన్ చేసిన కామెంట్లకి క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి.
దేశంలో హైదరాబాద్ నగరాన్ని గాని మరొక నగరాన్ని గాని కేంద్రం కేంద్ర పాలిత ప్రాంతాలగా చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దేశంలో ప్రధాన నగరాలను మరింతగా అభివృద్ధి చేయటం కేంద్రం యొక్క ఉద్దేశం అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజస్వరూపం ప్రజలకు బాగా ఇప్పుడు అర్థమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీతో పొత్తు లేదని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెగ ప్రచారం చేసుకొని ఇప్పుడు మేయర్ ఈ విషయంలో రెండు పార్టీలు ఏకం అయ్యాయని.. టీఆర్ఎస్ ఎంఐఎం పొత్తు అపవిత్ర పొత్తు అంటూ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ వ్యతిరేకించిన పార్టీ మజిలీ సినిమా అటువంటి పార్టీతో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం అంటే.. తెలంగాణ కోసం బలిదానాలు అయిన వారి ఆత్మ ఘోషించేలా కెసిఆర్ వ్యవహరించినట్లు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఒకలాగా.. మేయర్ పీఠం విషయంలో మరొక లాగ టిఆర్ఎస్ సమయం పార్టీలు వ్యవహరించి ప్రజలను మోసం చేసినట్లు కిషన్ రెడ్డి కామెంట్లు చేయడం జరిగింది.