రాష్ట్రంలో వర్షాలు బాగా కురియడంతో జనాలు అనేక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో చాలామంది రాజకీయ నేతలు వరదల్లో అనేక ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్నారు. దీనిలో భాగంగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. తన పర్యటనకు అధికారులు రావటం లేదు ఏంటి అంటూ ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి అధికారులకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. తన పర్యటనకు ఆర్డీవో స్థాయి అధికారులు రావాలని కోరారు. కూడా హాజరు కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రులు వస్తున్నా గాని ప్రభుత్వ అధికారులలో బాధ్యత లేదు ఏంటి అంటూ ఫోన్ లో ఓ ప్రభుత్వ అధికారికి ఫుల్ క్లాస్ పీకారు.
ఢిల్లీ వెళ్లిపో మంటావా అంటూ ఫోనులో దంచి కొట్టారు. కాగా వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఎలాంటి అవసరం ఉన్న స్పందించాలని స్థానిక నాయకులకు కిషన్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా భోజనం మరియు త్రాగు నీరు అందించాలని ఉన్న అధికారులకు కిషన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో వరద ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కిషన్ రెడ్డి పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇచ్చారు. స్థానికంగా ఉండే అవసరతలు తీర్చాలని అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ఆదేశాలు ఇస్తూ పర్యటించారు.