Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కనుమరుగై పోయినట్లే అని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల తర్వాత కామెంట్లు భీకరంగా వస్తూ ఉన్నాయి. ఏకంగా చంద్రబాబు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు గెలవలేని పరిస్థితి ఉండటంతో మరింతగా.. టిడిపిపై విమర్శలు వినబడుతూన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలలో … అధికార పార్టీ వైసిపి.. తిరుగులేని విజయం సాధించడంతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయన్న సమయంలో చంద్రబాబు.. నిమ్మగడ్డ.. వాయిదా వేసి వెళ్లిపోయారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చిన తర్వాత మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే.. ఎక్కడా టీడీపీ గెలవలేదని, ఓట్ల లెక్కింపు కావాలని.. ఆపించేశారని టిడిపి నాయకుల పై కొడాలి నాని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే ఎన్నికల విషయంలో ఎక్కడా కూడా సీఎం జగన్ ఇంటి నుండి బయటకు రాలేదని.. ఆ రీతిగా ఎన్నికలలో వైసీపీ గెలిచింది అని అన్నారు. ప్రజలు ఈ విధంగా జగన్ ని జీవిస్తుంటే చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని.. కొడాలి నాని సెటైర్లు వేశారు. మరి ఇటువంటి తరుణంలో 800 మంది టీడీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది వీళ్లంతా చంద్రబాబుని.. దిక్కరించిన వాళ్ళ అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో తండ్రీకొడుకులు రోడ్లపై ప్రచారం చేసినా గాని ప్రజలు వాళ్ళను పట్టించుకోలేదని.. చంద్రబాబు నారా లోకేష్ ను ఉద్దేశించి కొడాలి నాని సెటైర్లు వేశారు. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు ని తొలగించి ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన వారిలో ఒకరిని నియమించుకొండి అని సూచించారు.
చంద్రబాబునీ.. లోకేష్ ని నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ క్లోజ్ అవటం గ్యారెంటీ అని మండిపడ్డారు. B అదే రీతిలో అయ్యన్నపాత్రుడు పై.. కొడాలి నాని సీరియస్ అయ్యారు. సీఎం జగన్ ని ఉద్దేశించి టిడిపి నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నిజంగా చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ పోటీ చేయాలని ఈ క్రమంలో ఆయన గెలిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన.. బూతు తుడుస్తూ కూర్చుంటా అంటూ.. కొడాలి నాని చాలెంజ్ చేశారు.