తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ సీరియస్ అయ్యారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకో లేకపోయారు అని విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు పెనం మీద ఉంటే … ఉద్యోగులు పోయిలో ఉన్నారని సెటైర్లు వేశారు. ప్రభుత్వ ఉద్యోగులు వెట్టి కార్మికులు లాగా పని చేస్తున్నారని.. వాళ్ళ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని పేర్కొన్నారు.
ఉద్యోగులు పని భారంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అదే విధంగా వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లా లో జరగబోయే పట్టభద్రుల ఎన్నికలలో తెలంగాణ జన సమితి పార్టీ కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
అంతేకాకుండా కాంగ్రెస్ మరియు వామపక్ష పార్టీల సపోర్ట్ కూడా త్వరలో కూడగట్టుకొని ఎన్నికల బరిలో దిగుతామని కోదండరాం స్పష్టం చేశారు. ఏది ఏమైనా అధికారంలోకి వచ్చాక టిఆర్ఎస్ పార్టీ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి నట్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. మరో పక్క పట్టభద్రుల ఎన్నికలలో అదేవిధంగా జరగబోయే దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలలో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని చోట్ల గెలవడానికి టిఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. ఎక్కడా కూడా పార్టీ ఓడిపోకుండా ఇప్పటి నుండే సరికొత్త వ్యూహాలతో టిఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ దూసుకుపోతున్నరు. ఇలాంటి తరుణంలో కోదండరాం ఏ విధంగా పట్టభద్రుల ఎన్నికలలో ఎలా నెట్టుకోస్తారో అన్నది సస్పెన్స్ గా ఉంది.