అమరావతి: దివంగత టిడిపి నేత. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామ్ నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల, ఆయన కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. వీటిపై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివరాం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. స్థానిక కోర్టులో హజరు కావాలని సూచించింది. హైకోర్టు సూచనల మేరకు మంగళవారం నర్సరావుపేట కోర్టులో శివరాం లొంగిపోయి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు ఆరు కేసుల్లో బెయిల్ లభించింది.
కాగా కోడెల ఆత్మహత్య కేసులో విచారణ కోసం హాజరుకావాలని హైదరాబాదు పోలీసులు కోరారు. తన తండ్రి అంతిమ సంస్కారాలు పూర్తి అయిన తర్వాత విచారణకు హజరవుతానని శివరాం హైదరాబాదు పోలీసులకు తెలిపారు.