రాష్ట్రంలో కొత్త జిల్లాల సంఖ్య విషయంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఏపీ లో ఉన్న ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా 25కు పెంచాలని విధాన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.దీనికి సంబంధించిన కసరత్తు కూడా చాలా వేగంగా జరుగుతోంది.ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలెవరూ తలదూర్చవద్దని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
దీంతో ఈ వ్యవహారం గుంభనంగా సాగిపోతోంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు ఇరవై అయిదు కాదని ఇరవై ఆరు జిల్లాలు కావచ్చునని కోన రఘుపతి మీడియా సమావేశంలో చెప్పటం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.ఏపీలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా అరకు నియోజకవర్గం విషయంలో ఏర్పడిన సంక్లిష్టత కారణంగా మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి వస్తోందని కోన రఘుపతి తెలిపారు.వచ్చే ఏడాదిలో ఏపీ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ కోసం నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని ఆయన తెలిపారు.వచ్చే ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన ఉండబోతోందని ఆయన వెల్లడించారు. దీంతో ఎన్ని జిల్లాలు ఉండబోతున్నాయనే అంశంపైనా క్లారిటీ వచ్చినట్లయింది.
జిల్లాల సరిహద్దులతో పాటు ఇతర అంశాలపై అధికారులు నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో రఘుపతి వ్యాఖ్యలకి ప్రాధాన్యత లభించింది.జిల్లాల ఏర్పాటు విషయంలో రఘుపతికి పూర్తి అవగాహన ఉంది.ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా గా రూపాంతరం చెందే నేపధ్యంలో రఘుపతి ఈ జిల్లా కిందకు వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల అధికార పార్టీ నేతలతో చర్చలు జరుపుతూ అందరికీ అన్ని విధాలా న్యాయం చేస్తామని చెబుతున్నారు.ముఖ్యంగా చీరాల బాపట్ల లను జంటనగరాలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదన కూడా రఘుపతి వద్ద ఉంది.కీలకమైన పదవిలో వున్న రఘుపతి జిల్లాల సంఖ్యను కూడా ప్రకటించడంతో అదే ఖరారు కావొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?