అమరావతి, జనవరి 30: కాపు రిజర్వేషన్లు ప్రధాన మంత్రి మోది ఖాతాలోకి వెళ్ళాలని భారతీయ జనతాపార్టీ ఎమ్మోల్సీ సోము వీర్రాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను బిసిల్లో చేరుస్తామని ప్రకటించిన హమీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన పనులను తన ఖాతాలో వేసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
బిసి ఎఫ్ కేటగిరి తెచ్చి ఉంటే అది ఆయన ఘనత అయ్యేదని వీర్రాజు చెప్పారు. కేంద్రం సహకారం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విజయాలు సాధించిందని ఆయన అన్నారు.
రాష్ట్రానికి 74 అంశాల్లో కేంద్రం సహకరిస్తోందని ఆయన అన్నారు. 24 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా కేంద్ర సహకారంతోనే సాధ్యం అయిందని ఆయన చెప్పారు.
ఆర్దికంగా వెనుకబడిన పేదలకు కేంద్రం ఇటీవల 10 శాతం రిజ్వరేషన్లు కల్పించింది.
కేంద్రం ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదుశాతం కాపులకు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.