బెంగళూరు లో జరిగిన అల్లర్ల గురించి నెటిజన్లను కేటీఆర్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం ఎంత పని చేస్తుందో తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇటీవల బెంగళూరులో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డీజే హలిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి నివాసం వద్ద రాత్రి తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విషయం లో చెలరేగిన ఈ వివాదం బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో పోస్ట్ పెట్టారంటూ ఆందోళనకారులు ఆగ్రహంతో ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి ఇంటిపై రాళ్లదాడి చేశారు. అయితే ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. అదే రీతిలో ఆందోళనకారులు జరిపిన దాడిలో 67 మంది పోలీసులు గాయాలపాలయ్యారు.
దీంతో ఘటనకు సంబంధించి బాధ్యులైన 147 మందిని అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు తెలియజేశారు. అంతేకాకుండా డీజే హలి పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. సామాజిక మాధ్యమంలో వివాదాస్పద పోస్ట్ పెట్టిన ఎమ్మెల్యే బంధువు నవీన్ ని అరెస్టు చేసినట్లు కూడా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ గొడవ దేశవ్యాప్తంగా మరియు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక ఎన్ని ఉద్రిక్తతలకు దారి తీస్తుందో. అదే రీతిలో అవాస్తవాలు పాల్పడే వారి పట్ల నెటిజన్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. సామాజిక మాధ్యమాలను సంఘవ్యతిరేక శక్తులుగా ఎవరు ప్రోత్సహించ రాదని ట్విట్టర్ లో కేటీఆర్ పేర్కొన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?