హైదరాబాద్ నగరం అంటే ట్రాఫిక్ సమస్యతో పాటు నీటి సమస్య కూడా గుర్తుకు వస్తది. ఇదిలాఉండగా త్వరలో దాదాపు 30 సంవత్సరాల పాటు హైదరాబాదులో నీటి కొరత ఉండదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల హైదరాబాద్ జలమండలి పురపాలక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేశవాపురం ప్రాజెక్టు పనులకు సంబంధించి వివరాలు అధికారుల దగ్గర కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సుమారు 1490 ఎకరాల భూ సేకరణ దాదాపు పూర్తి కావచ్చింది అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే 2050 వరకు హైదరాబాదులో తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్య ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన పనులు సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతుంది అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని పనులు వేగంగా పూర్తి చేయాలని, ఈ సందర్భంగా జలమండలి అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా నగరంలో 770 ఏం.ఎల్.డిల మురికి నీటి శుద్ధీకరణ కొనసాగుతుందని ఇది దేశంలో అన్ని నగరాల్లో కన్నా అత్యధికమని కేటీఆర్ తెలిపారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో నీటి కొరత ఉండదని కేటీఆర్ తెలపడంతో హైదరాబాద్ వాసులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరోపక్క కొంతమంది ఎన్నికలప్పుడే కాదు, మామూలు అప్పుడు కూడా పనిచేయాలని ఈ వార్తల పై స్పందిస్తున్నారు. అంతేకాకుండా వర్షం వచ్చిన సమయంలో రోడ్లు జలమయం అవడం వంటి విషయాలపై కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రజా సమస్యల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.