KTR: తెలంగాణ రాజకీయాలలో ప్రజెంట్ హాట్ టాపిక్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కెసిఆర్ భేటీ. ఇద్దరూ కూడా ఏకంగా రెండు రోజులపాటు.. వివిధ విషయాలకు సంబంధించి చర్చించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్- టిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని ఆ దిశగా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వస్తున్న వార్తలపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అనవసరమైన పార్టీ అని కేటీఆర్ ఒకే ఒక డైలాగ్ తో తీసిపారేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అటువంటి పార్టీతో తమకు ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. దేశంలో 50 సంవత్సరాల తరబడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇస్తూ పోయారని…అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రజలు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో ఘోరంగా విఫలం అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా దేశాన్ని… తిరోగమన బాట లోకి నెట్టేసింది అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మొదట ఆదరించారు.. ఆ తర్వాత పరీక్షించారు..ఇంకా ఆ తర్వాత పక్కన పెట్టేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు భవిష్యత్తు లేదు.అని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది ఉండదని.. మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మే 22 నుంచి 26 వరకు స్విజర్లాండ్ లోనీ దావోస్ జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సు ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నట్టు సమాచారం. ఇదే సమావేశానికి ఏపీ సీఎం జగన్ కూడా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుండి రెండు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని సమాచారం. ప్రపంచ స్థాయి వాణిజ్యం మరియు రాజకీయ ప్రముఖులు ఈ వేదికపై అనేక విషయాలకు సంబంధించి చర్చలు జరుపుతారు.