కర్నూలు, జనవరి 8: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, సోలార్ పార్క్ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కర్నూలు ఆసుపత్రిలో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్, ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు శంఖుస్థాపన చేశారు.
తదుపరి పాణ్యం మండలం బ్రాహ్మణపల్లి, జూపాడుబంగ్లా మండలం తుంగదంచ, బనగానపల్లి పరిధిలో ఎంఎన్ఎంఈ పార్క్ల ఏర్పాటుకు చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎయిర్ పోర్టులో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలన్నదే మన లక్ష్యమనీ, ఇందుకు అందరూ సహకరించాలని చంద్రబాబు అన్నారు. ఆయన వెంట ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.