ఇటీవల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టిఆర్ఎస్ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతల తీరు చూస్తుంటే కేసీఆర్ జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కెసిఆర్ హడావిడి చేస్తూ దేశం బాగుపడాలంటే ఎన్డిఎ, యూపీఏ కూటమి నుండి దేశాన్ని రక్షించాలని ప్రత్యామ్నాయం ఉండాలని కామెంట్లు చేశారు. జాతీయస్థాయి పార్టీల వల్ల దేశం బాగుపడదని భారీ డైలాగులు వేశారు. కానీ తరువాత సైలెంట్ అయిపోయారు.
కానీ ఇటీవల కేసీఆర్ జాతీయ స్థాయిలో రాణించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు అటు జాతీయ మీడియాలో కూడా వైరల్ అవుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలు జాతీయ స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పూర్తి విషయంలోకి వెళ్తే రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విషయంలో చాలా ఆలస్యం అవుతుందని ఆరోపించారు. కావాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నట్లు విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా కేంద్రం నుంచి బకాయి నిధులు రాకపోయినా గాని జీహెచ్ఎంసీకి నిధుల కొరత ఉన్నాగాని….హైదరాబాద్ నగరంలో ఆస్తిపన్ను, నీటి పనులను పెంచడం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, రెవిన్యూ ఖర్చు అంతా కలిపితే హైదరాబాద్ అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు దాటుతుందని కేటీఆర్ వివరించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు హైదరాబాద్ నగరంలో చేపట్టినట్లు స్పష్టం చేశారు.
దీంతో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఖర్చు పెట్టిన లక్ష కోట్లు వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందా కేటీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా…గట్టిగా ఒక వర్షం పడితే రోడ్లన్నీ గుంతలు పడిపోతున్నాయి. సరిగ్గా రోడ్డు మీద బండి డ్రైవ్ చేయడానికి కూడా పరిస్థితులు బాగోలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. వర్షం వల్ల రోడ్డు పై వచ్చే నీళ్లను అరికట్టాలని ఈ సందర్భంగా చాలామంది కేటీఆర్ ని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు.