ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా చాలా మంది ప్రముఖులు అదేవిధంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆయన సమాధి వద్ద ఘన నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో భార్య లక్ష్మీపార్వతి కూడా ఎన్టీఆర్ ఘాట్లో పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు ఎన్టీఆర్. అదే విధంగా ఎంతో మందికి ఆదర్శం ఎన్టీఆర్ అంటూ కొనియాడారు.
ఆయన పేరు చెప్పుకోకుండా అదేవిధంగా ఆయన ప్రస్తావన లేకుండా ఏ పార్టీ, ఏ నాయకుడు ముందుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంచి పాలన జరుగుతుంది అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఎక్కడైతే మంచి పరిపాలన అందించడం జరుగుతుందో.. దాన్ని ఎన్టీఆర్ పాలనతో పోల్చడం జరుగుతుంది అని..అటువంటి రామరాజ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు అంటూ లక్ష్మీపార్వతి తెలిపారు.
అంతేకాకుండా ఈ ఏడాది జనవరి ఫస్ట్ నాడు తమ కుటుంభంలో మనవడు పుట్టారని.. దీంతో చిన్న ఎన్టీఆర్ మా కుటుంబం లోకి వచ్చినట్లయింది అని పేర్కొన్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తితో ఆ బిడ్డను తన శక్తి మేరకు పెంచుకుంటా అంటూ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.