Nimmagadda Ramesh Kumar : నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీకాలం ఈరోజు తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన నిమ్మగడ్డ..చివరి రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాదులో తన ఓటు హక్కు ఉంటే దానిని ఏపీలో స్వగ్రామానికి మార్చుకోవడానికి అనేక అవస్థలు పడుతున్న టు ఏది ఏమైనా ఓటు హక్కును న్యాయపోరాటం చేసి అయినా సాధించుకుంటాం అని పేర్కొన్నారు. పదవిలో ఉన్నంత కాలం తన పరిధిలో తప్ప వేరే విషయాల్లో కి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు.
అంతేకాకుండా చట్టసభలకు అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ పట్ల తనకు అవగాహన ఉందని ..చాలా వరకు సామరస్యంగా నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ పై నిబంధనలకు లోబడి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాలను గౌరవించాలని, ఇతర వ్యక్తుల చేత ప్రభావితమయ్యే పరిస్థితుల ఉండకూడదు అని..తనకి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించింది అని స్పష్టం చేశారు.
ప్రభుత్వం సపోర్ట్ చేయటం వల్లే పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగినట్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా చివరి రోజు తాను గవర్నర్ ని కలవాలని ప్రయత్నించాను కానీ ఆయన వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల అపాయింట్మెంట్ దొరకలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాధికారులు నుండి పూర్తి సహకారం రావటం వల్లే ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినట్లు చివరిరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి స్పష్టం చేశారు. ఇదే తరుణంలో తన తర్వాత ఎస్ఈసీగా బాధ్యతలు నీలం సాహ్ని చేపట్టబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ విధులు.. బాధ్యతలపై ఆమెతో చర్చించినట్లు స్పష్టం చేశారు.