విజయవాడ, జనవరి 8: జనసేన అధినేత పవన్ కల్యాణ్తో వామపక్షాల నేతలు పొత్తులు, సీట్ల కేటాయింపులపై చర్చలు జరిపారు. ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్రకార్యదర్శి మధు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్తో చర్చలు జరిపి వారు కోరుతున్న అసెంబ్లీ సీట్లకు సంబంధించిన వివరాలు అందజేశారు. అనంతరం నాదెండ్ల మనోహర్ వారిని పవన్ నివాసానికి తోడ్కొని వెళ్లారు.
వారు పవన్తో వివిధ అంశాలపై ఏకాంతంగా చర్చించారు. అనంతరం వామపక్షాల నేతలు రామకృష్ణ, మధులు మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై చర్చించాం. సంక్రాంతి పండుగ తరువాత మరో సారి భేటి అవుతాం. సీట్ల కేటాయింపుపై కూడా చర్చలు జరిపాం అని వెల్లడించారు. టిడిపి, వైసిపిలను ఎన్నికల్లో ఎలా ఎదుర్కొవాలి అనే అంశాలపై కూడా చర్చలు జరిపినట్లు వారు తెలిపారు.