విశాఖపట్పం, జనవరి 11: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తో కలసి వామపక్ష పార్టీలు పోటీ చేయనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారనీ, తమ కూటమి ద్వారా ప్రత్యామ్నాయం తీసుకుని వస్తామనీ చెప్పారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల మద్దతులేదని ఆయన పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా దళితులు భారతీయ జనతాపార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారనీ,అందుకనే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజ్వరేషన్ను కేంద్రం చట్టం ద్వారా కల్పిస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం కూటముల వల్ల ప్రయోజనం లేదని ఆయన చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ వల్ల కూడా ఉపయోగం లేదని ఆయన అన్నారు.
ఈనెల 18,19,20 తేదీల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
previous post