Lockdown : కరోనా మహమ్మారి మరొకసారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ తన ఉనికిని చాటడం మొదలుపెట్టింది. భారతదేశంలో నిదానంగా ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. మరొక నెల రోజుల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇక భారతదేశంలోనే ఇలా ఉంటే మిగిలిన దేశాల భారతీయుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యాయి. దానికి సంబంధించిన సూచనలు ఇప్పటి నుండి బయట పడుతున్నాయి. మహమ్మారి కారణంగా అక్కడ ఏళ్ళ తరబడి నివాసం ఉంటున్న వారు స్వదేశాల్లో నిలిచిపోవడంతో సుమారు రెండు లక్షల మంది ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్ లను కోల్పోయినట్లు కువైట్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
కోవిడ్ కారణంగా ప్రయాణాలపై ఆంక్షలుఇంకా కొనసాగడంతో స్వదేశాలకు వెళ్ళిన ప్రవాసులంతా తిరిగి కువైట్ వెళ్ళలేకపోవడంతో ఒక ఏడాదికి రెండు లక్షల మంది రెసిడెన్సీ గడువు ముగిసిపోయింది.
సరే ఇప్పుడైనా వెళ్లి అక్కడ ఈ గడువు ముగిసేలోపు రెన్యువల్ చేయించుకుందాము అని అనుకుంటే వచ్చే నెలలో ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నీ బంద్ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీకి కేవలం మరో వారం రోజులే ఉంది. వెళ్తే మళ్లీ ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి రెసిడెన్సీ పర్మిట్ మాట అటుంచి ముందు ప్రాణం కాపాడుకుంటే చాలు అన్నట్లు పరిస్థితి తయారైంది/
గత ఏడాది మార్చి 10 నుండి ఈ సంవత్సరం వరకు కువైట్లో రెండు లక్షల మంది దేశం బయట ఉండడంతో వారి రెసిడెన్సీ పర్మిట్ లను కోల్పోయారు. ఈ జాబితాలో ఈజిప్ట్ దేశానికి చెందినవారు మొదటి స్థానంలో ఉంటే భారత్-శ్రీలంక దేశస్థులు రెండవ స్థానంలో ఉన్నారు. కువైట్ నుండి వెళ్ళిన తర్వాత ప్రవాసులు విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా రెసిడెన్సీ పర్మిట్ ను రెన్యూవల్ చేసుకోవాలని సంబంధిత అధికారులు చెప్పారు.
అయితే గడువు ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి కువైట్ ప్రవేశించాలంటే వారి స్పాన్సర్ లు కొత్త ఎంట్రీ వీసాలు పొందాల్సి ఉంటుందని తెలిపారు. కువైట్ జనాభా 48 లక్షలు. ఇందులో విదేశీయులు 34 లక్షలు. ఆ దేశంలో ఉండే 70% వారంతా ఇతర దేశాలకు చెందిన వారు. వీరిఓ భారతీయుల సంఖ్య 14.5 లక్షలు. ఇక రానున్న రోజుల్లో ఆర్థికంగా ప్రజలను ఈ కోవిడ్ మరెంత ఇబ్బంది పెడుతుందో చూడాలి.