దావోస్(స్విట్జర్ల్యాండ్), జనవరి 22: 49వ ప్రపంచ ఆర్థిక సదస్సలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ఐటి, పంచాయితీరాజ్శాఖా మంత్రి లోకేశ్ అధికారుల బృందంతో చర్చించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి మరిన్ని పారిశ్రామిక పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన మంగళవారం తన ట్విటర్లో పోస్టు చేశారు.
దావోస్లో జరుగుతున్న సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఆంక్షల కారణంగా ఆయన బదులు లోకేశ్ హాజర్యారు.
ఈ సదస్సులో మంత్రి అమరావతి రాజధాని నిర్మాణం గురించి, పారిశ్రామిక అవకాశాల గురించి తెలియజేయనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?