చంద్రబాబు 2014 ఎన్నికలలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ తరుపున ఎమ్మెల్సీగా నారా లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే మంత్రిపదవి రావడంతో, చంద్రబాబు క్యాబినెట్ లో మాత్రమే కాకుండా పార్టీ వ్యవహారాలలో అతి తక్కువ టైమింగ్ లో దూసుకుపోయారు లోకేష్. గ్రౌండ్ లెవెల్ నుండి కాక గోల్డెన్ స్పూన్ తరహాలో లాంచ్ అవటంతో నారా లోకేష్ చాలా సందర్భాలలో కొన్ని విషయాలను హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా బహిరంగ సమావేశాలలో అదే విధంగా ప్రజా సమస్యల విషయంలో నారా లోకేష్ సరైన రీతిలో డీల్ చేయలేకపోయారు అని పార్టీలోనే టాక్ అప్పట్లో వినబడింది. అలాంటి తరుణంలో 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేసిన లోకేష్ దారుణంగా ఓటమి చెందారు. ఆ తర్వాత వెంటనే ఓటమి నుండి తేరుకుని ప్రస్తుతం గతంలో కంటే భిన్నంగా పార్టీ కార్యకర్తలతో కలిసి పోతూ ఇబ్బందుల్లో ఉన్న నాయకుల కుటుంబాలకు అండగా ఉంటూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా కరోనా తో ఇటీవల కృష్ణా జిల్లా లో ఎస్సై దుర్గారావు మృతి చెందడం జరిగింది. మృతి చెందిన ఎస్ఐకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సై కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఎస్సై స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కావటంతో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ కుమార్ తో నారా లోకేష్ ఫోనులో మాట్లాడటం జరిగిందట. ఆ కుమార్తె మాట్లాడుతూ మా నాన్న కూర్చున్న కుర్చీ లో నేను… కూర్చోవాలి అనుకుంటున్నట్లు నారా లోకేష్ కి తెలియజేసింది.
ప్రభుత్వం సాయం అందిస్తే కుటుంబ బాధ్యతను నా భుజాలపై వేసుకుంటా అని తెలిపింది. దీంతో నారా లోకేష్ స్పందిస్తూ ఆ పాపకు ధైర్యం చెప్పారట. అంతేకాకుండా ఆ కుటుంబానికి అన్నగా ఉంటానని… చదివిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా ఆ కుమార్తె చెప్పిన మాటలు అక్కడ టిడిపి నాయకులను కంటతడి పెట్టించి నట్లయింది. మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా జరిగిన ఈ ఘటనకి లోకేష్ స్పందించిన తీరు చూసి టిడిపి సీనియర్ నాయకులు ఆశ్చర్యపోతున్నారట. లోకేష్ లో చాలా మార్పు వచ్చిందని…. గతంలో కంటే చాలా షార్ప్ అయ్యారని, టిడిపి శ్రేణులు లోలోపల అనుకుంటున్నారట. పార్టీ నాయకులు అరెస్ట్ అయిన కార్యకర్తలకి ఎలాంటి ఆపద వచ్చినా నారా లోకేష్ ఇటీవల స్పందిస్తున్న తీరు టిడిపి పార్టీలో ప్రస్తుతం వైరల్ గా మారింది అని పొలిటికల్ వర్గాల్లో టాక్.