టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ రెడ్డి రౌడీ రాజ్యం లో రాష్ట్ర ప్రజలకు రక్షణ లేదు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ట్విటర్లో లోకేష్ పెట్టిన ట్వీట్లు ఒకసారి చూస్తే ఇలా ఉన్నాయి. రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడం చూశాం, కానీ రాష్ట్రంలో జగన్ రెడ్డి రాజ్యంలో రోడ్డుకి ఇప్పుడు ఏకంగా ట్రాక్టర్ అడ్డుపెట్టి, మట్టి పోసి మూడు గ్రామాలకు రాకపోకలు వైసిపి నాయకులు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో వ్యవహరించారు అని మండిపడ్డారు. గ్రామంలో ఓ భూ వివాదం విషయంలో సహకరించాలని ఆ గ్రామం పై కక్ష గట్టి అధికార పార్టీ నాయకులు ఉన్మాదం తో వ్యవహరిస్తున్నారంటూ సంచలన పోస్ట్ పెట్టారు.
వెంటనే ప్రభుత్వం ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని గ్రామాలకు రాకపోకలు పునరుద్ధరించాలని లోకేష్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా టిడిపి పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంలో జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా ఎండగట్టారు. కక్ష సాధింపు చర్యలు చేపట్టి అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసి ఇప్పుడు ఆయనకి కరోన అంటించారు అంటూ ద్వజమెత్తారు.
అదే రీతిలో అమరావతి రైతుల గురించి కూడా ట్విటర్లో లోకేష్ రియాక్ట్ అవుతున్నారు. దీంతో నారా లోకేష్ ప్రస్తుత రాజకీయాలపై పెడుతున్న ట్వీట్లు భలే భలేగా ఉన్నాయంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అమరావతి రాజధాని పై నీకు ఉన్నంత ప్రేమ…., రాజధాని ప్రాంతానికి చెందిన రైతులకు నీ పై లేదు, అందుకే గత ఎన్నికలలో నిన్ను ఓడించారు. దీనికి కారణం ఏంటి లోకేష్ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.