చంద్రబాబు వారసుడిగా మొట్టమొదటిసారి పార్టీ తరఫున ఎమ్మెల్సీగా బరిలోకి దిగి అతి తక్కువ సమయంలో మంత్రి అయిపోయారు లోకేష్. చంద్రబాబు కొడుకు కావడంతో చాలా మంది రాజకీయ నేతలు అప్పట్లో లోకేష్ ఎంట్రీ పై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. తీరా అయిన మైకు ముందు మాట్లాడే విధానం మీడియా సమావేశాలలో నాలుక కరుచుకుని వేసిన డైలాగులతో…లోకేష్ రాజకీయాలకు ఆన్ ఫిట్ అనే భావనకు వచ్చేశారు. అదే సమయంలో 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీచేసిన లోకేష్ ఓటమి చెందడంతో పొలిటికల్ గా ఇంకా ఆయన దుకాణం సర్దుకుంటే బెటర్ అనే టాక్ వచ్చింది.
కానీ చంద్రబాబు మాత్రం ఏదో విధంగా లోకేష్ ని రాజకీయంగా పైకి తీసుకొచ్చి తన వారసత్వాన్ని అందివ్వాలని చూశారని…, కానీ లోకేష్ విషయంలో రాజకీయంగా సరైన అవుట్ పుట్ రాకపోవటం చంద్రబాబుని నిరాశ లో నింపేసినట్లు మొన్నటి దాకా వార్తలు వచ్చాయి. అందువల్లే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పదవిని అచ్చెన్నాయుడు కి అప్పగించినట్లు కూడా సరి కొత్తగా టాక్ వస్తోంది. చంద్రబాబు వారసుడైన లోకేషన్ కనీసం పార్టీ భావి ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం పార్టీ శ్రేణులు కార్యకర్తలు లేని వాతావరణం నెలకొన్నట్లు ఏపీ పాలిటిక్స్ లో టాక్.
మరోపక్క అధికారంలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు చాలావరకు తమ భావి ప్రధాని రాహుల్ గాంధీ అని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపక్షంలో కూడా ఆ స్లోగన్ వినిపిస్తున్నారు. కనీసం ఇలాంటి ప్రయత్నం నారా లోకేష్ విషయంలో జరగకపోవడంతో చాలామంది పార్టీలో ఆయన పరిస్థితి చూసి పాపం లోకేష్ అనే భావనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా టిడిపి భవిష్యత్ నాయకుడు అన్న రీతిలో ఎంట్రీ ఇచ్చిన లోకేష్ పొలిటికల్ కెరియర్… ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు డేంజర్ జోన్ లో ఉన్నట్లే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.