చంద్రబాబు తనయుడిగా పార్టీలోకి ఎమ్మెల్సీ పదవి అందుకని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నారా లోకేష్. దీంతో టీడీపీ క్యాడర్ మొత్తం భవిష్యత్ నాయకుడు లోకేష్ యే అని ఫిక్స్ అయిపోయారు. కానీ చాలా సందర్భాలలో పార్టీ పరంగా జరిగిన సమావేశాల్లో అయినా పబ్లిక్ తో మాట్లాడే విషయంలో అయినా లోకేష్ తడబడిన మాటలు రాజకీయాల్లో ఇంకా ఎదగాలి అనే రీతిలో పార్టీలో ఉన్న నాయకులకు గుర్తు చేశాయి. కానీ ఈ విషయంలో ప్రత్యర్థుల మాత్రం లోకేష్ అసలు రాజకీయాలకు పనికిరాడు అన్నట్టు ప్రజలలో బలంగా ఆయన వ్యవహారాన్ని తీసుకెళ్ళారు.
ఇటువంటి తరుణంలో 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీకి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీకి దిగారు. అంతకుముందే టిడిపి హైకమాండ్ ఎన్నో నియోజకవర్గాలను పరిశీలించిన చివరాఖరికి మంగళగిరి అయితేనే లోకేష్ కి కరెక్ట్ అని భావించి ప్రకటించారు. కానీ అప్పటికే ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బలమైన నేతగా ఉండటంతో జరిగిన ఎన్నికలలో లోకేష్ ఓడిపోయారు. ఇదే టైములో టిడిపి కూడా చాలా దారుణమైన పతనమైన స్థితికి చేరి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత చాలావరకు లోకేష్ మంగళగిరి నియోజక వర్గాన్ని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ నాయకులు కూడా ఒకసారి లోకేష్ నియోజకవర్గాన్ని సందర్శించాలని పార్టీ క్యాడర్ ని కాపాడాలని అప్పట్లో కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇదిలా ఉండగా లోకేష్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో రాణించే గెలవాలంటే మంగళగిరి నియోజకవర్గం ఏమాత్రం సెట్ కాదని నివేదిక రావడంతో… లోకేష్ మంగళగిరి నియోజకవర్గని లైట్ తీసుకున్నట్లు సమాచారం.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు పరిస్థితులను గమనిస్తే లోకేష్ పొలిటికల్ గ్రాఫ్ ఏ మాత్రం కూడా పెరగలేదని తేలిందట. అంతే కాకుండా సామాజిక వర్గ సమీకరణాల పరంగా చూసుకున్న గాని రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం కూడా లేనట్లు తేలడంతో..కృష్ణా జిల్లా పెనమలూరు గాని గుంటూరు జిల్లా పెదకూరపాడు నుంచి కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు టిడిపి పార్టీలో అంతర్గతంగా వినబడుతున్న టాక్.