Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలుపు దేశంలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. కరోనా సెకండ్ వేవ్ విషయంలో మోడీ అట్టర్ ఫ్లాప్ అయినట్లు.. ఇంటర్ నేషనల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఒంటరి మహిళ గా బరిలోకి దిగి… ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ సభ్యులు కలిగిన బీజేపీని.. చిత్తుచిత్తుగా ఓడించడం..తో మోడీకి ప్రత్యామ్నాయ రాజకీయ నేత.. మమతా బెనర్జీ అనే టాక్ ప్రస్తుతం జాతీయ మీడియాలో మాత్రమే కాకా అంతర్జాతీయ మీడియాలో కూడా బలంగా వినబడుతోంది. స్వయంగా మోడీ అమిత్ షా రంగంలోకి దిగిన గానీ ఏ మాత్రం.. కరుకు బెరుకు లేకుండా.. మమతా వేసిన రాజకీయ వ్యూహాలు.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అందలం ఎక్కించడం దేశంలో సంచలనంగా మారింది.
ముఖ్యంగా మత రాజకీయాలు… చేసినా గాని మమతా బెనర్జీ.. వాటిని తనదైన శైలిలో ఎదుర్కొంటూ.. మత రాజకీయాలు బెంగాల్ లో పని చేయవని అని ఆమె రుజువు చేయడం.. గెలవటం.. బిజెపి నేతలకు మైండ్ బ్లాక్ అయింది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో… భారీగా గొడవలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాలలో ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మొట్టమొదటిసారి గెలిచిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతాబెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. తాను వీధుల్లో పోరాటం చేసే వ్యక్తిని మాత్రమే కానీ ఒంటరిగా పోరాటం… చెయ్యలేము అని తెలిపిన ఆమె రాబోయే రోజుల్లో బిజెపికి వ్యతిరేకంగా… ప్రజలలో పోరాట స్ఫూర్తిని నిలుపుతా,… కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. అంటూ మమతా బెనర్జీ దేశంలో ఇతర రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చినట్లు మాట్లాడింది.
వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అందరం కలిసి పోరాటం చేయాలని… ఇదే సరైన సమయం అని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ముందుగా.. బిజెపి కంటే ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండేలా కేంద్రాన్ని 30 వేల కోట్లను కేటాయించాలని… మమతా బెనర్జీ స్పష్టం చేసింది. అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో కేవలం కొన్ని రాష్ట్రాలకు ఆపన్నహస్తం అందిస్తూ మరికొన్ని రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపుతోంది అంటూ కేంద్రంపై ఆరోపణలు చేసింది. ఏది ఏమైనా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మూడోసారి గెలవడంతో దేశంలో మమతా బెనర్జీ పేరు ఇప్పుడు మారుమ్రోగేటమే కాక మోడీకి ప్రత్యామ్నాయంగా మారిపోయింది అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.