Corona: ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో పరిస్థితులు మొత్తం తలకిందులు కావడంతో… ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంతమంది కరోనా కటుకి బలి అవుతుంటే మరికొంతమంది ఇంటిలోనే ఖాళీగానే ఉంటూ… ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో చాలామంది సెలబ్రిటీలు రకరకాల సహాయ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా మంచు లక్ష్మి కూడా తాజాగా కరోనా వైరస్ వల్ల వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తన వంతుగా సహాయం చేస్తూ మెడికల్ సలహాలు ఇస్తూ … వారి ప్రాణాలను కాపాడటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ మరో పక్క ఇదే తరుణంలో ఒక గొప్ప పని చేయడం జరిగింది. దాదాపు వెయ్యి మంది పిల్లలకు తాజాగా మంచు లక్ష్మి స్వయంగా వారి బాగోగుల కోసం … సహాయం చేయడం జరిగింది. పాండమిక్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో… పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అన్నదానిపై కూడా మంచు లక్ష్మి అవగాహన కలిగించినట్లు సమాచారం.
ఇలాంటి సమయంలోనే కాదు వాస్తవానికి వైరస్ రాక ముందే ..మంచు లక్ష్మి తన సేవా గుణాన్ని బయటపెడుతూ “మేము సైతం” వంటి కార్యక్రమాల ద్వారా అనేకమంది కుటుంబాలలో సంతోషం కలిగించే రీతిలో రాణించింది. చాలా మంది పేద పిల్లలకు చదువు కూడా మంచు లక్ష్మి చెప్పించడం జరిగినది. తాను మాత్రమే కాక ఇండస్ట్రీలో అనేక మంది సెలబ్రిటీలను ఈ కార్యక్రమంలో భాగం చేసి పేదలను ఆదుకునే రీతిలో ముందుండి నడిపించింది. తాజాగా ఇప్పుడు మరోసారి మంచు లక్ష్మి..బయట పరిస్థితులు అదుపులో లేని రీతిలో ఉండటంతో పేద పిల్లలకు హెల్ప్ చేస్తూ రంగంలోకి దిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో ఆమె చేస్తున్న సహాయ కార్యక్రమాలు విని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.