అమరావతి: పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ టిడిపి నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న ఆరోపణపై మంగళగిరికి చెందిన పద్మ అనే మహిళా రైతును కృష్ణాజిల్లా కంచికచర్ల పోలీసులు అరెస్టు చేసి అనంతరం బెయిల్పై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు కొడాలి నానిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం గమనార్హం.