టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ రంగంలో మాత్రమే కాకుండా సినిమారంగంలో కూడా మంచి పరిచయాలు ఉన్న సంగతి తెలిసిందే. టిడిపి పార్టీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు పెద్దలు మద్దతుగా నిలుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా ఇటీవల గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో బాలసుబ్రమణ్యం కి భారత రత్న అవార్డ్ ఇవ్వాలని కోరడం జరిగింది.
కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో బాలసుబ్రమణ్యం కీ ఓ విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని జగన్ ని డిమాండ్ చేయటం మీడియా వర్గాలలో హాట్ టాపిక్ అయింది. ప్రపంచ మహా గాయకుడికి ఇంత చిన్న కోరిక… ప్రతి రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కోరటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అంతేకాకుండా అజ్ఞానంగా కూడా ఉన్నట్లు చాలామంది చెప్పుకొస్తున్నారు.
లతా మంగేష్కర్ ఇలాంటి వారికి భారతరత్న ఇవ్వటం జరిగింది. ఇంకా చాలా మంది ప్రముఖులకు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎస్పీ బాలు కి ఇస్తే తప్పేంటి అని చాలామంది చెప్పుకొస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నీ సన్నిహితులు కూడా అడిగినా గాని ఆయన నోటి నుంచి మాట మాత్రం బయటకు రావడం లేదన్న టాక్ వినబడుతుంది. మరోపక్క ఎస్పీ బాలుకు భారతరత్న అవార్డు గురించి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే..తన మామ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తుందేమో అన్న ఆందోళనతో చంద్రబాబు ఉన్నారని ప్రత్యర్థులు ఈ విషయం గురించి సెటైర్లు వేస్తున్నారు. ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డు ప్రకటిస్తే చంద్రబాబు రాజకీయాలలో మరియు కుటుంబంలో విలన్ అయిపోతారని ప్రత్యర్థులు చెప్పుకొస్తున్నారు.