ఇటీవల కేంద్ర పౌర విమానయాన, హౌసింగ్, అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ధిప్ సింగ్ నగరాలలో మెట్రో సర్వీసులు మళ్లీ ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయి అనేదానిపై ఓ ఇంటర్వ్యూ లో వివరణ ఇచ్చారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం రెండు వారాల్లో సరైన నిర్ణయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా దీనికి సంబంధించి స్టాండెడ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను జూన్ లోనే రెడీ చేశామని చెప్పుకొచ్చారు. మెట్రో సిస్టం తెరవడం పై ఎస్వోపి రెండు వారాల్లో అందరి ముందుకు తెస్తామని, అయితే దశలవారీగా మాత్రమే సర్వీసులు పునరుద్ధరణ ఉంటుందని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్ వర్కర్లు, ఇతర నిత్యావసర సేవలు సామర్ధ్యం 50 శాతానికి దాటరాదు అని చెప్పుకొచ్చారు. మెట్రో అధారిటీ నష్టాలు చవి చూస్తున్నందున పెరుగుతున్న కరోనా కేసులు నేపద్యంలో సెప్టెంబర్ లో ప్రారంభంకానున్న నాలుగో దశ అన్ లాక్ లో మెట్రో సర్వీసులు పునరుద్ధరణ పనులు జరగడం డౌటే అని ఊహాగానాలు వస్తున్నాయి.
ఇటీవల అన్ లాక్ 3 లో జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లో ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చిన కొన్ని రాష్ట్రాలలో ఇంకా మూతబడే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కరోనా మహమ్మారి ఎఫెక్ట్ ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో అయితే మరో రెండు వారాల్లో లేకపోతే అక్టోబర్ నుండి మెట్రో ట్రైన్ పట్టాలు ఎక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.