సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రధాని మోడీ మెట్రో ట్రైన్ ప్రాజెక్టులకు సంబంధించి భూమి పూజ వీడియో ద్వారా ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్, సూరత్ నగరాలను కనెక్టివిటీ చేస్తూ ప్రారంభమైన ఈ రెండు ప్రాజెక్టులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే బాగా వ్యాపారం జరిగే ఈ రెండు నగరాలలో మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ రావడం వలన మరింత లాభదాయకంగా పరిస్థితులు మారుతాయని మోడీ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా అహ్మదాబాద్, సూరత్ ప్రాంతాలకు ఈ నూతన మెట్రో రైల్ ప్రాజెక్టులు మరింత బహుమతులు అని అభివర్ణించారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టు విషయములో గత ప్రభుత్వాల కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మధ్య చాలా తేడా ఉందని స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా మెట్రో ట్రైన్ లైన్లు భారీ స్థాయిలో విస్తరించడం జరిగిందని పేర్కొన్నారు. అంతే కాకుండా 2014కి ముందు దేశంలో 225 కిలోమీటర్ల మెట్రో లైన్ మాత్రమే ఉండేదని, 2014 తర్వాత అనగా ప్రస్తుత ప్రభుత్వంలో దాదాపు 450 కిలోమీటర్ల మెట్రో లైన్ అందుబాటులోకి వచ్చిందని మోడీ పేర్కొన్నారు.