విశాఖపట్నం: అభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ అవసరమన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం వల్ల ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి సాధిస్తుందన్నారు. అటు కర్నూలు న్యాయ రాజధానిగా, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని జగన్ చెప్పడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. అధికార వ్యవస్థల వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక రాగానే పరిశీలించి రాష్ట్ర సమగ్రాభివృద్ధి, భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలన్న సిఎం జగన్ మాటలకు జనామోదం లభిస్తోందన్నారు.
previous post
next post