విశాఖ: టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవంతిని తాను మంత్రి గానే గుర్తించడం లేదనీ, తాను పార్టీ మారాలనుకుంటే ఎవరూ ఆపలేరంటూ గంటా సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీనిపై అవంతి స్పందించారు. గంటాపై వ్యక్తిగత దూషణలు చేశారు.
తన పదవి కోసం నమ్మిన వాళ్లను ముంచిన చరిత్ర గంటాదని అవంతి విమర్శించారు. తాను నోరు విప్పితే గంటా భండారం మొత్తం భయటకు వస్తుందని అవంతి వ్యాఖ్యానించారు. గంటాను తాను మనిషిగా కూడా గుర్తించనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆన్నం పెట్టిన వాళ్లకు గంటా సున్నం పెడతారనీ, ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన అయ్యన్నకే గంటా సున్నంపెట్టారని అవంతి విమర్శించారు. గంటా తనకూ సున్నం పూయాలని ప్రయత్నంచాడనీ, తాను పూయించుకోలేదనీ అవంతి అన్నారు. ఆయన ఇంకా మంత్రిగా ఉన్నానని భ్రమపడుతున్నారని అవంతి వ్యాఖ్యానించారు. ఆయన్ను వైసిపి చేర్చుకోదు అన్నట్లు వైసిపి మంచి వాళ్లనే చేర్చుకుంటుందని అవంతి అన్నారు.