తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఆయన బంధుగణం మాత్రం మల్లారెడ్డిని ఇరుకునపెడుతూనే ఉందట.. తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లోనలుగురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు రేవ్ పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే.
అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అరెస్ట్ అయిన వారిలో మంత్రి మల్లారెడ్డికి స్వయాన మేనల్లుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలే కరోనా సమయంలో వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్నందున ఇలాంటి పార్టీలకు ఎక్కడా అనుమతి లేదు. వీరు కూడా అనుమతి లేకుండా పార్క్ హయత్ హోటల్ లో పార్టీ చేసుకున్నారట. మామూలు టైంలోనే ఇలాంటి రేవ్ పార్టీకి అనుమతులు ఉండవు. అలాంటిది ఇలాంటి డిజాస్టర్ టైంలో ఇంకా కఠిన ఆంక్షలుంటాయి. దీంతో పోలీసులు సీరియస్ అయ్యి వైరస్ ప్రబలే చాన్స్ ఉంటుందని వారిని అరెస్ట్ చేసి డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు.ఇంతటి క్లిష్ట సమయంలో ఇలా మంత్రి మేనల్లుడు హోటల్ లో దొరకాడనే వార్త మంత్రి మల్లారెడ్డికి మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది. నిజంగానే అల్లుడు దొరికాడా లేదా అధికారికంగా తెలియకపోయినా ఈ వార్త వెలుగులోకి రావడంతో మల్లారెడ్డి ఇరుకునపడిపోయాడు.
ఇప్పటికే కరోనాతో సవాలక్ష సమస్యలతో ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలాంటి చర్యలకు దిగడం కరెక్ట్ కాదనే భావన అందరిలో వ్యక్తమవుతోంది.అయినా అల్లుళ్ళుతో మామలకు తిప్పలు తప్పడం లేదుచంద్రబాబు మొదలుకుని ఇప్పటి మల్లారెడ్డి మేనల్లుడితో సహా అందరూ అందరే అని చలోక్తులు పడుతున్నాయి.