Ramgopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma) తనదైన శైలిలో సమాజంలో జరిగే వాటి గురించి స్పందిస్తూ ఉంటారు అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు ప్రముఖ చానల్స్ డిబేట్ లో పాల్గొంటూ.. రాంగోపాల్ వర్మ చేసే వ్యాఖ్యలు.. సంచలనం రేపుతుంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం(Ap Governament) సినిమా టికెట్ల వ్యవహారం విషయంలో.. షోల విషయంలో.. తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇండస్ట్రీకి తలనొప్పిగా మారాయి అని ఇండస్ట్రీకి చెందిన చాలామంది అంటూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఈ విషయం గురించి ఓ ప్రముఖ ఛానల్లో డిబేట్ లో రామ్ గోపాల్ వర్మ చర్చిస్తూ ఉండగా.. ఆయనతో మంత్రి పేర్ని నాని( Perni Nani) ఫోన్ లో సంభాషించారు. సినిమాటోగ్రఫీ చట్టం కొత్తగా తమ ప్రభుత్వం తీసుకు రాలేదని ఎప్పటి నుండో ఉందని.. తెలియజేశారు.
ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ వేసిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. టికెట్ ధరల విషయంపై.. ఆర్జివి అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా.. రియాక్ట్ కావడం జరిగింది. సినిమా టికెట్ల ధరల విషయంలో గత ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించడం జరిగిందని.. స్పష్టం చేశారు. ఈ క్రమంలో సినిమా ఓటిటి(OTT)లో రిలీజ్ చేస్తే తనకు సంబంధం లేదని.. థియేటర్లలో విడుదల చేస్తే మాత్రం తప్పకుండా నిబంధన పాటించాల్సిందేనని అంటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.
అంతమాత్రమే కాకుండా ఏప్రిల్ మాసం లోనే తమ ప్రభుత్వం జారీచేసిన జీవోను న్యాయస్థానానికి చెందిన కొంత మంది న్యాయమూర్తులు.. సమర్థించడం జరిగిందని ఇదే క్రమంలో జడ్జి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని తెలిపారని స్పష్టం చేశారు. మొత్తంమీద రాంగోపాల్ వర్మ ఇటీవల పలు మీడియా ఛానల్స్ ఏపీ ప్రభుత్వం పై.. భారీ ఎత్తున వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ఉన్న సమయంలో… వైసీపీ మంత్రి ఫోన్ కాల్ లో మీడియా ఛానల్ లో.. రాంగోపాల్ వర్మ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం సినీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.