Minister Rojaphone: వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకి మంత్రి పదవి రావడం తెలిసిందే. వైసీపీ పార్టీలో వైఎస్ జగన్ ని అత్యంత గౌరవంతో అభిమానించే నేతగా.. ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ఫైర్ బ్రాండ్ అనే ముద్ర కలిగిన రోజా.. మంత్రి అయిన తర్వాత చాలా బిజీగా మారిపోయారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత .. తన ని నమ్మి పదవి ఇచ్చిన సీఎం జగన్ కి మంచి పేరు తీసుకొస్తాం అని స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న తన శాఖకు సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ లో మంచి రోజా పాల్గొనడం జరిగింది. అయితే… జరిగిన రివ్యూ మీటింగ్ లో మంత్రి రోజా ఫోన్ పోయిందట. ఎంత గాలింపులు చేపట్టిన గాని దొరకకపోవడంతో పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి.. ఫోన్ ఆచూకీ కోసం తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. ఈ ఫోన్ లో రోజా గారి కి సంబంధించి వ్యక్తిగత సమాచారం ఇంకా డేటా ఉన్నట్లు.. ఈ విషయాన్ని రోజా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రోజా ఫోన్ రివ్యూ మీటింగ్ లో పోవటంతో ఈ వార్త ఏపీ పొలిటికల్ ఇన్ సైడ్ సర్కిల్స్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఈ ఘటన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హల్ లో జరిగింది. మంత్రి అయ్యాక తొలి మీటింగ్ తిరుపతిలో నిర్వహించారు రోజా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్కు హాజరైన రోజాకి అధికారులు ఘనస్వాగతం పలికారు. అయితే ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ఫోన్ పోవడం జరిగింది. ఇదిలా ఉంటే ట్రాకింగ్ విధానం ద్వారా సెల్ ఫోన్ చోరీ చేసిన దొంగని పోలీసులు పట్టుకున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మంత్రి రోజా ఫోన్ చోరీకి గురికావడం సంచలనంగా మారింది.