Minister Roja: మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా ఫుల్ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోపక్క ప్రముఖులను కలుస్తూ ఉన్నారు. ఇదే సమయంలో వేసవి నేపథ్యంలో రోజా శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిక్షణా శిబిరాలను ప్రారంభించడం తెలిసిందే. అయితే ఈ తరుణంలో పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించి అక్కడ బాస్కెట్ బాల్ పోటీలను ప్రారంభించారు. అనంతరం విజయవాడ శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలను ప్రారంభించడం జరిగింది.
నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడామైదానంలో శిక్షణా శిబిరాలను ప్రారంభించి మంత్రి రోజా ప్రసంగించారు. మహమ్మారి కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు క్రీడాకారులు ఎల్ల కే పరిమితం కావాల్సి వచ్చింది. ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యాన్ని అదేవిధంగా అవార్డులను అందుకోగలం. రాష్ట్ర ప్రభుత్వం 48 విభాగాల్లో ఈ వేసవి శిక్షణ క్రీడలకు కోచింగ్ ఇస్తోంది. రాష్ట్రంలో 1670 సమ్మర్ శిక్షణ క్యాంపు కార్యాలయాలు ప్రారంభించబోతున్నాం. ఈ సమ్మర్ క్యాంప్ శిక్షణా శిబిరాల ద్వారా కొత్త టాలెంట్ వెలికితీస్తూ మట్టిలో మాణిక్యాలను పైకి తీసుకొస్తామని తెలిపారు. ఇప్పటికే వైయస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు క్రీడాకారులకు అందిస్తున్నాం.
ఇదే సమయంలో రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలు అక్రమాలకు గురయితే వెంటనే వాటిని సంరక్షించి క్రీడా ప్రాంగణాలు గా మళ్లీ అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆ తర్వాత కె.బి.యన్ కళాశాలలో రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మంత్రి రోజా ప్రారంభించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో ఐదు వందల మందికి పైగా రక్త దానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ సమాజంలో యువతకు సేవాభావం ఉండటం మంచి విషయం అని తెలిపారు. ఒకరు ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని నిలబెడుతుంది రక్తం ఇవ్వడంతోపాటు అవయవదానం చేయాలి అని పేర్కొన్నారు. కరోనా ఈ సమయంలో రక్తం నిల్వలు తగ్గి పోయాయి. ఇక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశాన్ని రాష్ట్రాన్ని నడిపేది యువతే అని బలంగా నమ్మిన ఆయన యువతకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని మంత్రి రోజా స్పష్టం చేశారు.