గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న అభియోగంతో పాటు గతంలో ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో ఇటీవల తెలంగాణ పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. తన పై నమోదు చేసిన పీడీ యాక్ట్ పై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. హైకోర్టులో పిడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ కూడా దాఖలు చేశారు రాజా సింగ్. మరో పక్కరాజాసింగ్ సతీమణి ఉషాభాయి ఈ రోజు తెలంగాణ గవర్నర్ తమిశి సైని కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన ఉషాభాయి … గవర్నర్ తమిళిసైని కలిసి తన భర్త రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తన భర్తపై అక్రమంగా కేసులు పెట్టారని గవర్నర్ కు లేఖ అందజేశారు. ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తొందని ఉషాభాయి లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రాజాసింగ్ చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన భర్తపై అక్రమంగా కేసులు బనాయించి ప్రభుత్వం జైలుకు పంపిందనీ, దీనిపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరారు ఉషాభాయి. గత కొద్ది రోజులుగా తన భర్తపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు తరలించారనీ, న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఉషాబాయి తాజాాగా గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు.
ప్రభుత్వం ఒ వర్గానికి కొమ్ము కాసేలా వ్యవహరిస్తొందనీ, దాన్ని ప్రశ్నిస్తున్నందు వల్లనే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టిందని ఉషా భాయి పేర్కొన్నారు. ఉషాభాయితో పాటు పలువురు మహిళలు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రగతి భవన్ (సీఎం కేసిఆర్), రాజ్ భవన్ (తమిళిసై) మధ్య తీవ్ర మనస్పర్ధనలు నెలకొన్న ఈ తరుణంలో ఉషాభాయి విజ్ఞప్తి పై గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు .. చర్లపల్లి జైలుకు తరలింపు