Mla Roja : ఎమ్మెల్యే రోజా Mla Roja వైఎస్సార్సీపీ ముఖ్య నేతల్లో ఒకరు. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు ఆమెను పార్టీలో క్రియాశీలకంగా మార్చాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాణిని బలంగా వినిపించడంతో Ys Jaganకు పార్టీకి ఆమె విధేయురాలిగా మారి..Fire Brandగా పేరు తెచ్చుకున్నారు. ఈక్రమంలో 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో ఆమెకు మంత్రి పదవి ఖాయమనే అనుకున్నారు. కానీ.. అలా జరగలేదు. దీంతో ఆమె అప్పటినుంచీ దాదాపు సైలెంట్ అయ్యారనే చెప్పాలి. 2019కి ముందు Roja వేరు.. ఇప్పుడు వేరు అనే మాట పార్టీలోనే కాదు.. ప్రజల్లో కూడా ముద్రపడిపోయింది. కానీ.. ఇప్పుడు మళ్లీ ఆమె బౌన్స్ బ్యాక్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.
ఇటివలే చెన్నైలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోజా యాక్టివ్ అవుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీని గెలిపించాలని ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే… ఎన్నిక ముగిసిన తర్వాత చంద్రబాబు, లోకేశ్ పై ఆమె చేసిన వ్యాఖ్యలే హైలైట్ అయ్యాయి.
‘ఓటమి జీర్ణించుకోలేకే టీడీపీ డ్రామా మొదలుపెట్టింది. పెద్దిరెడ్డిని వీరప్పన అంటున్న లోకేశ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. వీరప్పన్ గా పేరు తెచ్చుకున్న కిశోర్ కుమార్ రెడ్డిని పక్కనే పెట్టకుని తిరుపతి ఉప ఎన్నికకు వెళ్లలేదా చంద్రబాబూ?’ అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం రాజకీయవర్గాల్లో ఈ వ్యాఖ్యలు గట్టిగానే వెళ్లాయి. ఈస్థాయిలో రోజా విరుచుకుపడటం గతంలోనే జరిగింది.
ఇలా మళ్లీ రోజా బౌన్స్ బ్యాక్ అవడం.. ఇకపై కంటిన్యూ అవుతుందా? లేక చిత్తూరు జిల్లావాసిగా తిరుపతి ఉప ఎన్నిక సందర్బంగా తన మాట సాయమా అనే మీమాంశ లేకపోలేదు. పైగా.. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉందని తెలుస్తోంది. 2019లో రోజాకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం పెద్దిరెడ్డి అనే ఊహాగానాలు లేకపోలేదు. ఈసారైనా అడ్డంకులు దాటి సాధించుకోవాలనే ప్రయత్నమా అనేది చూడాలి.
ఎమ్మెల్యేగా గెలిచిన ఎవరికైనా మంత్రి కావాలని ఉండటం సహజం. పైగా.. తొలి విడతలో కొత్తవారికి కూడా మంత్రి పదవులు దక్కాయి. కాబట్టి ఈసారైనా పదవి దక్కించుకునే క్రమంలో ఇలా కమ్ బ్యాక్ అవుతున్నారా? ఏదేమైనా.. రోజా మళ్లీ తన వాయిస్ పవర్ చూపితే వైసీపీకి అదనపు బలం చేకూరినట్టే.