Flash News: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ రెండో వారం నుండి ఒక్కసారిగా కేసులు పెరిగిపోవటంతో పాటు .. కరోనా రోగులకు ఆక్సిజన్ అందని పరిస్థితి హాస్పిటల్స్ లో ఏర్పడటంతో .. ప్రభుత్వాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దాదాపు రోజుకి లక్షల్లో కేసులు అదే రీతిలో వేళల్లో మరణాలు సంభవించడం తో .. కరోనా సెకండ్ వేవ్ ఇండియా ని గట్టిగా పగబట్టింది అనే టాక్ అంతర్జాతీయంగా వినబడింది.
పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం దేశంలో గత కొద్ది రోజుల నుండి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు రికవరీ పెరగటంతో .. సోమవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ట్విట్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం అదే రీతిలో దశలవారీగా అన్లాక్ ప్రక్రియ గురించి ప్రధాని మోడీ ఈరోజు ప్రసంగించనున్నట్లు సమాచారం.