ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువ ఉన్నా గానీ వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకు దేశవ్యాప్తంగా అనేకమంది పరిపాలకులను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇదిలా ఉండగా విద్యుత్ సంస్కరణలో భాగంగా వైయస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణయాని మోడీ సర్కార్ ఎలాంటి మొహమాటం లేకుండా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే ఉచిత విద్యుత్ అంటూ గతంలో రైతులకు ప్రభుత్వాలు అండగా తోడుగా ఉండేవి.
అయితే ఎంత విద్యుత్ వాడుతున్నారు అన్న దాని విషయంలో ఎవరికీ కూడా క్లారిటీ ఉండేది కాదు. అయితే తాజాగా సరికొత్త మీటర్లు బిగించి వాటికి సంబంధించిన బిల్లును నేరుగా ప్రభుత్వం కట్టె తరహాలో ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే మాదిరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ కూడా ఇల్లు, కమర్షియల్ వ్యాపార సంస్థలు వాడే విద్యుత్ విషయంలో ప్రీపెయిడ్ మీటర్లు వాడేలా రాష్ట్రాలకు ముసాయిదాను పంపటం జరిగింది.
ఈ దెబ్బతో ఎవరైతే బిల్లులు కట్టారో వాళ్లకు రాబోయే రోజుల్లో ఈ మీటర్ల విధానం ద్వారా అనేక ఇబ్బందులు తప్పవని సమాచారం. ప్రీపెయిడ్ మీటర్ల విధానం ద్వారా డబ్బులు చెల్లించి బ్యాలెన్స్ వేసుకుంటేనే కరెంటు సరఫరా అవుతుంది. మొబైల్ లో ఏ విధంగా అయితే బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకుంటామో ఆ తరహాలో విద్యుత్ విషయంలో కూడా వాడకానికి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎవరైతే బిల్లులు కట్టని వారు ఉంటారో వారు చెల్లించాల్సిన బిల్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది అని నిపుణులు చెప్పుకొస్తున్నారు. దేశంలో ఉన్న కొద్దీ విద్యుత్ బకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రీపెయిడ్ మీటర్ల విధానం అమలులోకి తెచ్చినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం వాడుతున్న మీటర్లు ఉంచుతారా లేదా అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.