గతంలో ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుండి అడుగుపెట్టాలంటే స్పందన యాప్ లో పేర్లు నమోదు చేసుకుని కలెక్టర్ల అనుమతి ఉంటేనే చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అనుమతి ఇచ్చేవారు. అయితే స్పందన యాప్ లో పర్మిషన్ రావటానికి ఒక్కోసారి టైం చాలా తీసుకోవటంతో ప్రభుత్వం పై అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత యాప్ లో పేరు నమోదు చేసుకున్న వెంటనే పాస్ మంజూరయ్యే విధంగా ఏపీ సర్కార్ చర్యలు తీసుకోవటంతో..
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లో ఆ పాస్ చూపించి ఏపీ లోకి ఎంటర్ అయ్యే వారు. ఆ వివరాల ఆధారంగా ఏపీ లోకి వచ్చే వారి ఆరోగ్య పరిస్థితిని గ్రామ వాలంటీర్లు గాని వైద్య సిబ్బంది గాని సమీక్షించి వివరాలను జాగ్రత్తగా దగ్గర పెట్టుకునేవారు. ఇదిలా ఉండగా ఇటీవల మోడీ సర్కార్ అన్ లాక్ 3.0 నిబంధనల ఆధారంగా అంతర్ రాష్ట్ర రాకపోకలకు సంబంధించి, ప్రభుత్వాల నుండి ఎలాంటి పర్మిషన్ లు అవసరం లేదని ప్రకటించడం అందరికీ తెలిసిందే.
అయితే అంతర్ రాష్ట్ర ప్రయాణాల విషయంలో మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కానీ రాష్ట్రంలో జగన్ సర్కార్ నో అనటం అనేక విమర్శలకు దారితీస్తోంది. దీంతో చాలామంది ఏపీ లోకి వద్దాం అనుకున్న వాళ్లు సరిహద్దుల్లో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరో పక్క రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో….
కచ్చితంగా ఏపీ లో అడుగుపెట్టాలంటే స్పందన పాస్ ఉండాల్సిందే అని చెక్ పోస్టుల దగ్గర రాష్ట్ర పోలీసులు చూపించమంటున్నారట. పరిస్థితులు ఇలా ఉండగా కేంద్రం కరుణించిన ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విధంగా మొండి వైఖరితో ఉంటే ఎలా అని సరిహద్దుల దగ్గర ఆగిపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కామెంట్ చేస్తున్నారట.