ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యావిధానం అలవాటు చేస్తే వారి పిల్లలు జీవితంలో రాణిస్తారని తద్వారా వారి జీవితాలు మారుతాయని బలంగా నమ్ముతారు. అందుకోసం ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం తీసుకురావటానికి జగన్ తీసుకున్న నిర్ణయం అప్పట్లో రాజకీయంగా అనేక విమర్శలకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ప్రవేశ పెట్టడం వల్ల తెలుగు భాష విలువ తగ్గిపోతుందని జగన్ తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు.
అంతేకాకుండా న్యాయస్థానాలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియం విద్యావిధానాన్ని ఆపేయటం కూడా జరిగింది. ఈ తరుణంలో జగన్ సర్కార్ విద్యార్థుల తల్లి తండ్రుల దగ్గర అభిప్రాయాలను సేకరించింది. ఒక నివేదిక రూపంలో 90 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్యావిధానానికి ఓకే చెప్పినట్లు న్యాయస్థానానికి తెలపడంతో ఈ విషయంలో చాలా వరకు గందరగోళ పరిస్థితి తగ్గిపోయింది.
ఇదిలా ఉండగా త్వరలో మరో అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇటీవల మోడీ హయాంలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న ఒక ఐడియా జగన్ ప్రభుత్వానికి ఫెచ్చింగ్ గా మారటం గ్యారెంటీ అని మేధావుల నుండి టాక్ వస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే ఇటీవల కేంద్ర క్యాబినెట్ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషకి సంబంధించిన బిల్లుకి ఆమోదం లభించింది.
దీని ప్రకారం ఉర్దూ, కాశ్మీరీ, డోగ్రి, హిందీ, ఇంగ్లీష్ భాషను అధికారిక భాషలుగా గుర్తించామన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో జగన్ తీసుకురావాలనుకుంటున్నా ఇంగ్లీష్ మీడియం విద్యావిధానానికి దాదాపు అన్ని అడ్డంకులు తొలగిపోయి నట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.