దేశ 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోటసాక్షిగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అతి కొద్ది మంది సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. పూర్తి విషయంలోకి వెళితే ప్రధాని మోడీ తన ప్రసంగంలో “ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు” అనే కొత్త పథకాన్ని ప్రకటించడం జరిగింది.
ఈకార్డు లో ప్రతి దేశ పౌరుడి ఆరోగ్య వివరాలు ఉండేలా డిజిటల్ రూపంలో ఈ కార్డు రూపొందించనున్నట్లు మోడీ చెప్పుకొచ్చారు. ఈ హెల్త్ కార్డు హోల్డర్ కి జరిగిన చికిత్సలు మరియు పరీక్షలు వాటి యొక్క వివరాలు ఈ కార్డులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దేశ పౌరుడు యొక్క పూర్తి హెల్త్ డీటెయిల్స్ మొత్తం కేంద్ర సర్వర్ తో అనుసంధానం చేయనున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరికి హెల్త్ ఐడి క్రియేట్ చేయడం ద్వారా వారు హాస్పిటల్ కి వెళ్ళిన, మెడికల్ షాప్ కి వెళ్ళిన దాని ద్వారా వారికి సంబంధించిన పూర్తి మెడికల్ వివరాలు అందుబాటులో ఉంటాయి.
దేశంలో ఏ వైద్యుడైన రోగి యొక్క వివరాలు ఈ కార్డు ద్వారా తెలుసుకోవచ్చు, ప్రతిసారి ప్రిస్క్రిప్షన్లు పట్టుకెల్లే అవసరం లేదు. ఆధార్ కార్డు తరహాలో ఈ హెల్త్ కార్డు ఉంటుందని మోడీ తన ప్రసంగంలో ఈ హెల్త్ కార్డు గురించి అన్ని విషయాలు స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. మోడీ ప్రారంభించిన “నేషనల్ హెల్త్ డిజిటల్ మిషన్” నుంచే ఈ సంస్థ కార్యకలాపాలు జరగనున్నాయి. భారతదేశంలోని ప్రతి పౌరుడికి హెల్త్ కార్డ్ కేటాయిస్తారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల దూరం ఉండేలా కూర్చుని, వేడుకలు అతి తక్కువ మంది తిలకించారు. ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరూ మాస్కు ధరించారు.