ఏపీ లో 3 రాజధానులు కథ కంచికి చేరటంతో గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో మూడు రాజధానులు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారు బీజేపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులను మోడీ వద్దకు వెళ్లకుండా రాష్ట్ర బిజెపి పార్టీలో ఓ వర్గం అడ్డు పడిందని, పైకి అమరావతి కి అనుకూలంగా బీజేపీ నేతలు మాట్లాడిన అంతర్గతంగా రాష్ట్రంలో పరిస్థితి మోడీ తెలియకుండా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
రాజధాని కోసం కొన్ని వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల దీక్ష మ్యాటర్ మోడీ దాకా వెళ్లి ఉంటే రాష్ట్రంలో 3 రాజధానుల నిర్ణయానికి గవర్నర్ నుండి ఆమోదముద్ర వచ్చేది కాదని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో దీక్షలు ఆందోళనలు చేస్తున్న రైతులు మరియు టిడిపి పార్టీ నాయకులు కూడా ఈ రీతిగానే రాష్ట్ర బిజెపి పార్టీ నాయకత్వంపై మండిపడుతున్నారు.
ఖచ్చితంగా రైతుల ఉసురు బిజెపికి తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. పైకి అమరావతికి సపోర్ట్ చేస్తూనే మరోపక్క నంగనాచిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రాజధాని నిర్ణయానికి కేంద్రానికి సంబంధం లేదని బిజెపి నాయకులు వ్యవహరించారని విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. నిజంగా అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని బీజేపీకి ఉంటే కొత్తగా అధ్యక్షుడైన సోము వీర్రాజు ఈపాటికి ఈ విషయంలో గట్టిగానే రియాక్ట్ అయ్యేవారు కదా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి.
అంతేకాకుండా బిజెపికి చెందిన సుజనాచౌదరి అమరావతి కి సపోర్ట్ చేస్తే…ఆయనని కావాలని ఆ పార్టీకి చెందిన వాళ్లే ఇటీవల విమర్శించడం జరిగింది. ఇక్కడే క్లియర్ గా అర్ధం అవుతుంది, రాష్ట్ర బీజేపీ నేతల కనుసన్నల్లోనే మూడు రాజధానులు ఏర్పడుతున్నట్లు అమరావతి ప్రాంత రైతుల నుండి అదేవిధంగా వివిధ పార్టీల నుండి అనే విమర్శలు వస్తున్నాయి.