రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బీభత్సంగా కురిసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు రాష్ట్రాలలో వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లన్నీ జలదిగ్బంధం అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం మొత్తం నీటిలో మునిగి పోయే పరిస్థితి ఏర్పడింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా కూడా లేచి పోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలలో వర్షాలపై ప్రధాని మోడీ ఆరా తీస్తూ కేసిఆర్ జగన్ లకి ఫోన్ చేశారు.
ఈ సందర్భంగా ఏపీలో వరదలతో నెలకొన్న పరిస్థితి గురించి ప్రధాని మోడీ కి సీఎం జగన్ వివరించారు. వాయుగుండం తీరం దాటడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు గురించి కూడా మోడీకి వివరించారు. ఇదే రీతిలో తెలంగాణ సీఎం కేసీఆర్ కి కూడా మోడీ ఫోన్ చేయడం జరిగింది.
హైదరాబాదులో పరిస్థితి గురించి ఇంకా మిగతా చోట్ల నెలకొన్న వరద ప్రభావం గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో లో 24 గంటలు గడిచినా వరద పరిస్థితి అదుపులోకి రాని విధంగా మారటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నా ట్లూ తెలుస్తుంది. చాలాచోట్ల కరెంటు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కీలక ప్రాంతాల లో నడుము లోతు నీళ్ళు రావడంతో… పరిస్థితి చాలా దారుణంగా మారింది. మరోవైపు ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలు చేపడుతోంది.