పీఎఫ్ ఖాతాదారులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. పీఎఫ్ కాంట్రిబ్యూషన్ భారాన్ని మరో మూడు నెలల పాటు భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో పరిస్థితులు ఇంకా దేశంలో సరిగ్గా కుద్దుట పడకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పీఎఫ్ ఎకౌంటు లో సాధారణంగా కంపెనీ 12 శాతం, ఉద్యోగి వేతనంలో 12 శాతం (బేసిక్, డీఏ) జమవుతూ వస్తుంది. అయితే కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వమే ఈ కంట్రిబ్యూషన్ను భరిస్తోంది. లాక్ డౌన్ టైం లో మార్చి మరియు ఏప్రిల్ అదేవిధంగా మే నెలలో కేంద్ర ప్రభుత్వమే పీఎఫ్ డబ్బులను ప్రజల తరఫున కంపెనీ తరఫున ఈపీఎఫ్ ఖాతాలో జమచేస్తూ వచ్చింది.
ఇప్పుడు ఇదే విధానాన్ని మరో మూడు నెలలు పాటు కేంద్ర ప్రభుత్వమే పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని భరించడానికి రెడీ అయ్యింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆగస్టు వరకు పీఎఫ్ డబ్బులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఫెసిలిటీ అందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 72 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని, కేంద్ర ప్రభుత్వం దీని కోసం ఏకంగా 4860 కోట్ల భారం భరిస్తూన్నట్లు చెప్పుకొచ్చారు.