తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కంట్రోల్ చేయడంలో చాలావరకు కేసీఆర్ విఫలమైనట్లు విపక్ష పార్టీల నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కరోనా వైరస్ వచ్చిన ప్రారంభంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి పట్టని విధంగా మీడియా సమావేశాలు నిర్వహించిన కెసిఆర్… అవలీలగా మహమ్మారిని ఎదుర్కొంటామని భయంకరమైన డైలాగులు వేయడం జరిగింది.
కరోనా పై కేసీఆర్ ఫెయిల్….
అదే టైంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి అవసరమైతే తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు మాస్కులు లేకుండా ప్రజల కోసం కష్టపడ్డా తామని, వైరస్ తో పోరాడుతామని స్పష్టం చేయడం జరిగింది. సీన్ కట్ చేస్తే కొద్ది నెలలకే తెలంగాణ రాష్ట్రంలో భయంకరంగా వ్యాప్తి చెందటం తో పాటు చికిత్స అందిస్తున్న వైద్యులకు రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకి భయంకరంగా కరోనా సోకే పరిస్థితి ఏర్పడింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు.
తమిళ్ సై ద్వారా కేసీఆర్ పై మోడీ అస్త్రం….
సామాన్య ప్రజలు కూడా అనేక ఇక్కట్లు పడటంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పటంతో కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానాలు కలుగజేసుకుని తెలంగాణ ప్రభుత్వానికి వార్నింగులు మీద వార్నింగులు ఇవ్వటం జరిగింది. దీంతో మెల్లగా ప్రభుత్వంలో కదలిక స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా ఎప్పటి నుండో తెలంగాణా లో ప్రధాన పార్టీగా నిలదొక్కుకోవాలని బిజెపి ప్లాన్ చేస్తూ వస్తోంది. అయితే కరోనా విషయంలో కేసిఆర్ బేజారు నిర్ణయాలు తీసుకోవడంతో మోడీ తెలంగాణ గవర్నర్ తమిళ సై ద్వారా మెల్లగా బిజెపి పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అందువల్లే ఇటీవల గవర్నర్ తమిళ సై కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వార్తలు జాతీయ స్థాయిలో వస్తున్నాయి.
కేసీఆర్ పరువు జాతీయ స్థాయిలో తీసేసినా గవర్నర్….
కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో గాని ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలను కల్పించడంలో గాని తెలంగాణ ప్రభుత్వం విఫలం అయినట్లు తాను స్వయంగా చూశాను కాబట్టి ఈ ఆరోపణలు చేస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ తమిళసై వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఆమె వెనకాల నరేంద్రమోడీ ఉన్నట్లు ఆమె ద్వారా ప్రభుత్వం పై ప్రజలకు చులకన భావన కలిగేలా ఎత్తుగడ వేసినట్లు సమాచారం. తాజాగా తమిళ సై జాతీయ మీడియా ముందు కరోనా కట్టడి చేయడంలో కెసిఆర్ పూర్తిగా ఫెయిల్ అయినట్లు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.