2019 ఎన్నికలలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గెలవడంతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపి అన్ని విధాలా అండగా ఉంటానని కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా జగన్ ని ముఖ్యమంత్రిగా మొదటిసారి కలుసుకున్న టైంలో చాలా ఆప్యాయంగా కౌగిలించుకుని మరి…స్వాగతం పలికి దాదాపు గంటన్నర సేపు జగన్ తో మోడీ ప్రత్యేకంగా భేటీ అవటం అప్పట్లో దేశరాజకీయాల్లో సంచలనం సృష్టించింది. దీంతో వైయస్ జగన్ అంటే మోడీ కి స్పెషల్ ప్రేమ అని అందరూ భావించారు.
అదే రీతిలో కేంద్రం నిధులు కూడా రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉంటే జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేను నెలలు కావస్తోంది. 10 సంవత్సరాల పాటు పోరాడి అధికారంలోకి వచ్చిన జగన్ కి త్వరలో మోడీ సర్కార్ షాక్ ఇవ్వతున్నాట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ జమిలి ఎన్నికలు జరిపించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. “ఒకే దేశం ఒకే ఎన్నిక” అన్న రీతిలో దేశంలో 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలే కాదు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఇదే రూటు లోకి తీసుకువచ్చి మొత్తం ఎన్నికల ప్రక్రియ ఒకేసారి జరిపించడానికి మోడీ సర్కార్ తాజాగా పావులు కదుపుతున్నట్లు జాతీయ మీడియా వర్గాల్లో వార్తలు వెలువడుతున్నాయి.
మరోపక్క త్వరలో మూడు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత ఏడాది దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో ఎన్నికలు జరగనున్నాయి. తరువాత కర్ణాటక తెలంగాణ అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తరువాత 2024 నాటికి మళ్లీ కేంద్రంలో ఎన్నికలు జరగనున్నాయి, అదే సమయంలో ఏపీ లో కూడా జరుగుతాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ దేశంలో చాలా గట్టిగా ఉండటంతో రాబోయే మూడు రాష్ట్రాల ఎన్నికలు ఆరు నెలలపాటు వాయిదా పడే అవకాశం ఉందట. దీంతో మొత్తం ఎన్నికల షెడ్యూల్… తారుమారు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో ఇదే సరైన టైమింగ్ అని 2022లో జమిలి ఎన్నికలు జరపటానికి మోడీ సర్కార్ రెడీ అయినట్లు ఢిల్లీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఏపీలో కూడా బిజెపిని గెలిపించడానికి మోడీ సర్కార్ పవన్ కళ్యాణ్ తో అతి పెద్ద స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇందుకుగాను అమరావతిని చాలా లైట్ తీసుకుంటున్న జగన్ ని టార్గెట్ చేయడం కోసం అదే అమరావతిని మెయిన్ పాయింట్ గా తీసుకొని పవన్ కళ్యాణ్ తో బీజేపీ సరికొత్త గేమ్ ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నట్లు టాక్. ఈ దెబ్బతో 2022కి వైసిపి ఓట్ బ్యాంక్ కి గ్యారెంటీ చిల్లులు పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా ఈ వార్త ఏపీ రాజకీయాల్లో వైరల్ కావటంతో…. జగన్ మద్దతుదారులు అమ్మనా మోడీ, జగన్ మీద మీకు ఉన్నది కపట ప్రేమా? అంటూ తెగ చర్చలు జరుపుకుంటున్నారట. కేంద్రంలో అనేకసార్లు నీకు సపోర్ట్ చేసిన కనుకరించవా..? మా వాడిని 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉండనివ్వు అని జగన్ మద్దతుదారులు అంటున్నారట.