Mogilayaa Kinnera: తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిన్నెర కళాకారుడు మొగులయ్య అందరికీ సుపరిచితుడే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “బీమ్లా నాయక్” సినిమాలో పాట పాడి..కిన్నెర వాయిద్యం వాయించి.. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ గుర్తింపు దక్కించుకున్నడు. అంతమాత్రమే కాదు పద్మశ్రీ అవార్డు కూడా కిన్నెర కళాకారుడు మొగులయ్యకి కేంద్ర ప్రభుత్వం మొన్న ఇవ్వటం తెలిసిందే. అటువంటి మొగులయ్య ఇటీవల తనను రాజకీయంగా బలి చేయొద్దని.. నా నోట్లో మట్టి కొట్టదు… అంటూ పలు రాజకీయ పార్టీల నాయకులను వీడియోలో వేడుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి విషయంలోకి వెళితే పద్మశ్రీ అవార్డు అందుకున్న మొగులయ్యకి తెలంగాణ సీఎం కేసీఆర్ కోటి రూపాయల నజరానా అదే సమయంలో హైదరాబాద్ లో ఒక ఇల్లు దాని ఖర్చు నిమిత్తం డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది. అది ఇటీవల బిజెపి నాయకులతో.. కేసీఆర్ ఇంకా కోటి రూపాయలు ఇవ్వలేదు అని..రెడ్ హ్యాండెడ్ గా మొగులయ్య వీడియోలో దొరకడంతో ఆ వీడియో బయటకు రావటం సంచలనంగా మారింది. ఇదే సమయంలో మొగులయ్య.. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు వీడియోలో బండి సంజయ్ పై పాజిటివ్ కామెంట్ చేశారు.
అదే సమయంలో బిజెపి నేత మొగులయ్యకి తెలియకుండానే వీడియో రికార్డు చేయటం బయటకు రావడంతో పెను దుమారం రేపుతోంది. దీంతో వెంటనే స్పందించిన మొగులయ్య… రాజకీయంగా బలి చేయద్దు నా నోట్లో మట్టి కొట్టాదు అంటూ తెలంగాణ రాజకీయ నేతలకు తెలియజేశారు. వీడియోలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నీ మొగులయ్య పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఈ వీడియో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య గొడవకు దారి తీసింది. ఈ పరిణామంతో ఎటొచ్చి ఈ వీడియో వల్ల తనకే నష్టమని భావించిన మొగులయ్య… తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. తప్పుడు ఉద్దేశంతో నేను ఎక్కడ మాట్లాడలేదని..మొగులయ్య క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే పద్మశ్రీ వెనక్కిచ్చేస్తా.. ఆ అవార్డును అడ్డంపెట్టుకుని నాపై రాజకీయాలు చేస్తే తన నోట్లో మట్టి పెట్టాలని చూస్తే.. కచ్చితంగా అవార్డు వెనక్కి ఇచ్చేస్తా అంటూ కిన్నెర కళాకారుడు మొగులయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.