NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ .. పిటిషన్‌లో సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ మరో సారి విచారణకు హజరు కావాలని ఆదేశించడం, ఈ కేసులో ఆయన తండ్రి భాస్కరరెడ్డి ని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో అవినాష్ రెడ్డి పలు సంచలన విషయాలను పేర్కొన్నారు. ఇద్దరు నిందితుల కుటుంబ సభ్యులతో వివేకాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.

YS Avinash Reddy

 

వివేకా హత్య కేసులో నిందితులైన ఇద్దరు వారు ఇళ్లలో లేని సమయంలో వివేకా వారి నివాసాలకు వెళ్లేవారని చెప్పారు. అంతే కాకుండా నిందితులతో వివేకా డైమండ్స్ వ్యాపారం చేశారని పేర్కొన్నారు. వివేకా రెండో భార్యతో వివేకా కుటుంబ సభ్యులకు ఆర్ధికపరమైన అంశాల్లో వివాదాలు నడుస్తున్నాయని కూడా ఆరోపించారు. వివేకా హత్య తో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న అవినాష్ రెడ్డి.. తనకు సీఆర్పీసీ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసిందనీ, తన స్టేట్ మెంట్ ను రికార్డు చేసిందని చెప్పారు. వివేకా కుమార్తె సునీత, స్థానిక ఎమ్మెల్సీ, టీడీపీ అధినేత చంద్రబాబు, సీబీఐ అధికారి అందరూ కుమ్మక్కయ్యారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. కుట్రలతో తనను ఇరికించాలని చూస్తున్నారని అన్నారు. కేవలం గూగుల్ టేకౌట్ ద్వారా తనను నిందితుడుగా చేర్చారని చెప్పారు. దస్తగిరిన సీబీఐ అధికారులు ఢిల్లీకి తీసుకువెళ్లి చాలా రోజులు అట్టిపెట్టుకున్నారనీ, డబ్బు లిచ్చటి ఆయనను అప్రూవర్ గా మార్చారని ఆరోపించారు.

ys Viveka Murder Case Telangana High court

 

తనకు సంబంధం లేని కేసులో ఇరికించాలనుకుంటున్నారని, న్యాయంపై తనకు నమ్మకం ఉందని అన్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరుతున్నానని విన్నవించారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ ను కొద్ది సేపటిలో విచారణ చేయనున్నది. అవినాష్ రెడ్డి ఇంతకు ముందు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్  కోసం పిటిషన్ దాఖలు చేసి మళ్లీ ఉపసంహరించుకున్నారు. తాజాగా మరో సారి విచారణకు సీబీఐ నోటీసులు జారీ చేయడం, భాస్కరరెడ్డిని అరెస్టు చేయడంతో అవినాష్ రెడ్డి మరో సారి హైకోర్టును ఆశ్రయించారు.

Breaking: కర్ణాటకలో ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీశ్ షెట్టర్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?