వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తలనొప్పులు తెచ్చింది అని అనుకున్నాము ఇప్పుడు వైసిపి దూకుడుగా ఉంది. అతనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అతన్ని పార్టీ నుంచి పంపించడానికి అన్ని ప్రణాళికలు వేసింది. కానీ ఈ తలనొప్పి కాస్తా ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీ వైపు మళ్ళింది. వైసీపీ.. రఘురామ కృష్ణం రాజు ను పార్టీ నుంచి బయటకు పంపించెంత వరకే పరిమితమవుతుంది. కానీ పార్లమెంటు నుంచి బయటకు పంపించాలంటే మాత్రం ఆ పని బిజెపి చేతిలోనే ఉంది. మరి బిజెపి ఈ పనిచేస్తుందా లేదా, అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తుందా లేదా వైసిపి చేస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారం ఎటొచ్చి బీజేపీకి తలనొప్పి అనేది అందుకే.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారా..? లేదా?
బిజెపికి రఘు రామ కృష్ణం రాజు అనే వ్యక్తి ఒకవైపు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక వ్యవస్థ ఒక వైపు ఉన్నట్లే ప్రస్తుత పరిస్థితి ఉంది. రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ ప్రస్తుతం ఉన్న పట్టుతో చూస్తే అతనిని అనర్హత వేటు వేయాలని పట్టుపడుతోంది. వేటు వేయకపోతే బీజేపీతో వైసీపీ కయ్యం పెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. చేయాల్సిన అవసరం లేదు ఈ తరుణంలో బిజెపి తాడోపేడో తేల్చుకోవాల్సి ఉంది. బీజేపీకి రాజ్యసభ అవసరాలు, భవిష్యత్తు రాజకీయ అవసరాలు, ఆంధ్రప్రదేశ్ లో ఇతర అవసరాల దృష్ట్యా వైసీపీతో ఎంతో కొంత పని పడింది. సో.. ఇటు ఒక వ్యవస్థ ఉంది. లేదు వైసీపీ అవసరం లేదనుకుంటే కేవలం రఘు రామ కృషంరాజు అనే వ్యక్తిని నెత్తిన పెట్టుకొని అతన్ని ప్రోత్సహించాలి. అంటే అతని సభ్యత్వాన్ని రద్దు చేయకుండా, వైసీపీ వేసిన అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలి. ఇదే చేస్తే వైసీపీతో పూర్తిగా బంధం తెంచుకోవాల్సి వస్తుంది. రఘు రామ కృష్ణంరాజు ను వెనుకేసుకురావాల్సి వస్తోంది. సో..ఇప్పుడు రెండిటిలో ఏమి చేయబోతున్నారు? బిజెపి పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు? పెద్దల మనసులో ఏముంది? అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశమే. సాధారణంగా స్పీకర్లు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. పార్టీల నిర్ణయాలే స్పీకర్ ల నిర్ణయాలుగా ఉంటాయి. ఎన్ని రాజ్యాంగ నిభందనలు చూపించినా, ఎన్ని న్యాయనిభందనలు, న్యాయపాయింట్ లు చూపించినా, ఎన్ని చిక్కులు, ఎన్ని ఆధారాలు చూపించినా సరే పార్టీ అధిష్టానం చెప్పిందే స్పీకర్ అయినా ఎవరైనా ఆచరించాల్సిందే. సో..స్పీకర్ ఇప్పుడు ఏం చేయాలన్నా సరే బిజెపి ఆదేశం కావాల్సిందే. రఘు రామ కృష్ణంరాజు వ్యవహారం అందుకే ఇప్పుడు బిజెపికి ప్రతిష్టాత్మకంగా మారనుంది.