MP Raju: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఒక పార్లమెంటు సభ్యుడిని పోలీసులు ఇలా ట్రీట్ చేస్తారా అని… దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులు నిలదీశారు. వారిలో మాజీ నటి సుమలత, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు అయిన మాణిక్యం టాగూర్ కూడా ఉన్నారు.
ఇప్పుడు వీరికి తోడుగా కేరళకు చెందిన ఎంపీ ప్రేమ్ చంద్రన్ కూడా రఘురామరాజు కి మద్దతు పలికాడు. ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ చూపించడం అనేది నిజంగా దారుణం అని వ్యాఖ్యానించారు. ఇది కేవలం రఘురామరాజు పైన జరిగిన దాడి కాదని మొత్తం పార్లమెంటుకే అవమానకరమని ఆయన అన్నారు. ట్విట్టర్ ద్వారా రఘురామరాజు కి తన సపోర్ట్ ప్రకటించిన ప్రేమ్ చంద్రన్ తాజాగా రఘురామరాజు తన పైన పోలీస్ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఉపయోగించారు అని తెలియజేసిన లెటర్ చూసి బాగా బాధపడ్డాను అని తెలిపారు.
అసలు ఒక ప్రజా నాయకుడు పైన పోలీసులు చూపించిన ఈ పద్ధతి సరైంది కాదని వ్యాఖ్యానించారు కచ్చితంగా ఈ విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాను అని ప్రకటించాడు. ఇప్పుడు కనుక మేము గొంతు ఎత్తకపోతే మరో రాష్ట్రంలో ఈ పరిస్థితి కూడా ఇలాగే తయారవుతుందని ఆయన అన్నారు. ఒక్కసారిగా జాతీయ నాయకులంతా రఘురామరాజు కి సపోర్ట్ చేయడం ఢిల్లీలో గాలు కూడా ఎంపీ రాజు వైపు ఉండడంతో జగన్ పార్లమెంట్ లో విలన్ అయిపోయాడు.
మరి వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు రేపు పార్లమెంటులో స్పందించే తీరు పై జగన్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.